calender_icon.png 27 August, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రమిత, అసంక్రమిత వ్యాధులను గుర్తించండి

14-03-2025 12:15:40 AM

వనపర్తి టౌన్, మార్చి 13: జిల్లాలో సంక్రమిత, అసంక్రమిత వ్యాధులను నిర్మూలించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్య అధికారులను ఆదేశించారు.క్షయ వ్యాధి, మధుమేహం, వేసవి కాలంలో వచ్చే వడదెబ్బలను అరికట్టేందుకు వైద్య శాఖ ద్వారా చేపడుతున్న చర్యల పై గురువారం కలెక్టర్ ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు.మిషన్ మధుమేహ ద్వారా జిల్లాలోని 40 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి మధుమేహం వ్యాధిని ముందుగానే గుర్తించి వ్యాధి నివారణకు అవగాహన, మందులు ఇవ్వడం జరుగుతుంది.

జిల్లాలో 40 సంవత్సరాల వయస్సు పైబడిన ప్రతి ఒక్కరికీ నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు ఇప్పటి వరకు దాదాపు 70 శాతం పూర్తి అయ్యిందని మిగిలినవి మార్చి 25 లోపు పూర్తి చేయాలని వైద్య అధికారులను ఆదేశించారు.వేసవి కాలంలో వడదెబ్బ బారిన పడకుండా అవగాహనతో పాటు అవసరమైన మందులు అన్ని ప్రాథమిక కేంద్రాల్లో సిద్ధంగా ఉంచుకోవాలని కలక్టర్ ఆదేశించారు.  ముఖ్యంగా ఉపాధిహామీ లో పనిచేసే వారికి ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు ముందుగానే అందుబాటులో ఉంచాలని సూచించారు.వడదెబ్బ బారిన పడకుండా తగిన సలహాలు సూచనలు ప్రచారం చేయాలని సూచించారు.జిల్లా వైద్య అధికారి డా. శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. సాయినాథ్ రెడ్డి, డా. రామచంద్ర రావు. డా. పరిమళ, బాసిత్ తదితరులు పాల్గొన్నారు.