1 July, 2026 | 10:25 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

గెలిపిస్తే నిరుద్యోగుల గొంతుకనవుతా

27-09-2024 01:13 AM

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి

నిజామాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే లక్షలాది మంది నిరుద్యోగ పట్టభద్రుల గొంతుకనై వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వీ నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మట్లాడారు. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు ఓటు హక్కు నమోదుకు అవకాశం ఉందని, పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగిం చుకోవాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో తమ ప్రతినిధులు కేంద్రాలను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంటారని, ఆసక్తి ఉన్న వారు ఓటర్‌గా నమోదు చేసుకోవాలని చెప్పారు.