14 April, 2026 | 5:15 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

మేం శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం

22-11-2025 01:04 AM

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ2’.  14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషిస్తుండగా, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం బెంగుళూరులో నిర్వహించిన ఈవెంట్‌లో ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.

బాలకృష్ణ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా శివతత్వాన్ని చాటిచెప్పేలా రూపొందిన అఘోర పాత్రలో బాలకృష్ణ అలరించారు. తల్లీ కొడుకుల మధ్య సెంటిమెంట్, భావోద్వేగాలను ఆవిష్కరించిన తీరు మెప్పించింది. విలన్‌గా ఆది పినిశెట్టి లుక్ భయానకంగా ఉంది. ‘ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా అక్కడ కనిపించేది ఒక మతం, కానీ ఈ దేశంలో ఎక్కడైనా కనిపించేది ఒక ధర్మం.. సనాతన హైంధవ ధర్మం’, ‘దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేం ఖండిస్తాం, మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ర్టైక్.

మా దేవుడితో పెట్టుకోవడానికి మీకు ఎంత ధైర్యం, ఇప్పటివరకు ప్రపంచ పటంలో నా దేశం రూపాన్ని మాత్రమే చూసి ఉంటావ్, ఎప్పుడూ నా దేశం విశ్వరూపాన్ని చూసి ఉండవు. మేం ఒక్కసారి లేచి శబ్దం చేస్తే, ఈ ప్రపంచమే నిశ్శబ్దం’ అంటూ బాలకృష్ణతో చెప్పించిన డైలాగులు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన్; సినిమాటోగ్రఫీ: సీ రాంప్రసాద్, సంతోష్ దేట్కే; ఎడిటర్: తమ్మిరాజు.