13 April, 2026 | 11:54 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

సాలార్జంగ్ మ్యూజియం ప్రారంభం

16-12-2024 12:00 AM

1951 డిసెంబరు 16: దేశంలో ఉన్న మూడు ప్రఖ్యాత జాతీయ మ్యూజియాల్లో సాలార్జంగ్ మ్యూజియం ఒకటి. మూసీనది తీరంలో ఉన్న ఈ మ్యూజియంలో దాదాపు 48 వేల చారిత్రక వస్తువులను భద్రపరిచారు. ఈ మ్యూజియంలో మూడో సాలార్జంగ్ మీర్ యూసఫ్ అలీఖాన్ ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి సేకరించిన అరుదైన కళాఖండాలున్నాయి. అనాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1951 డిసెంబరు 16న సాలార్జంగ్ కళాఖండాల ప్రదర్శనను ప్రారంభించారు.

ప్రత్యేక దేశంగా బంగ్లాదేశ్

1971 డిసెంబర్ 16: 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో దేశం సాధించిన విజయానికి గుర్తుగా డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌లో విక్టరీ డే జరుపుకుంటారు. పాకిస్తాన్ దళాలపై విజయం సాధించడంతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 

విజయ్ దివస్ ఇండియా

1971  డిసెంబర్ 16: 1971 ఇండో- యుద్ధంలో భారత్  సాధించిన విజయానికి గుర్తుగా డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుకుంటారు. ఈ రోజున భారత సాయుధ దళాలు నిర్ణయాత్మక విజయాన్ని సాధించాయి. ఫలితంగా పాకిస్తాన్ దళాలు లొంగిపోయి బంగ్లాదేశ్ విముక్తి పొందింది. ఈ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన భారత సైనిక సిబ్బంది ధైర్యసాహసాలు, త్యాగానికి స్ఫూర్తిగా విజయ్ దివస్ జరుపుకుంటున్నాం.