16-12-2024 12:00:00 AM
1951 డిసెంబరు 16: దేశంలో ఉన్న మూడు ప్రఖ్యాత జాతీయ మ్యూజియాల్లో సాలార్జంగ్ మ్యూజియం ఒకటి. మూసీనది తీరంలో ఉన్న ఈ మ్యూజియంలో దాదాపు 48 వేల చారిత్రక వస్తువులను భద్రపరిచారు. ఈ మ్యూజియంలో మూడో సాలార్జంగ్ మీర్ యూసఫ్ అలీఖాన్ ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి సేకరించిన అరుదైన కళాఖండాలున్నాయి. అనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1951 డిసెంబరు 16న సాలార్జంగ్ కళాఖండాల ప్రదర్శనను ప్రారంభించారు.
ప్రత్యేక దేశంగా బంగ్లాదేశ్
1971 డిసెంబర్ 16: 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో దేశం సాధించిన విజయానికి గుర్తుగా డిసెంబర్ 16న బంగ్లాదేశ్లో విక్టరీ డే జరుపుకుంటారు. పాకిస్తాన్ దళాలపై విజయం సాధించడంతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
విజయ్ దివస్ ఇండియా
1971 డిసెంబర్ 16: 1971 ఇండో- యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుకుంటారు. ఈ రోజున భారత సాయుధ దళాలు నిర్ణయాత్మక విజయాన్ని సాధించాయి. ఫలితంగా పాకిస్తాన్ దళాలు లొంగిపోయి బంగ్లాదేశ్ విముక్తి పొందింది. ఈ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన భారత సైనిక సిబ్బంది ధైర్యసాహసాలు, త్యాగానికి స్ఫూర్తిగా విజయ్ దివస్ జరుపుకుంటున్నాం.