15 April, 2026 | 11:56 AM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

భారత్ దాడులు ‘నగ్న దురాక్రమణే’

08-05-2025 12:34 AM
  1. ఖండించిన పాక్ జాతీయ భద్రతా కమిటీ
  2. పాకిస్థాన్ సాయుధ దళాలకు పూర్తిస్థాయి అధికారాల అప్పగింత

న్యూఢిల్లీ, మే 7: పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ఉగ్రవాద శిబిరా లపై భారత్ దాడులు ఆ దేశానికి  మింగుడుపడటం లేదు. దీంతో తమ సాయుధ దళాల కు పూర్తిస్థాయి అధికారాలు అప్పగించినట్లు తెలుస్తోంది. బుధ వారం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా కమిటీలో భారత్ వైమానిక దాడులకు ఆత్మరక్షణ కోసం ప్రతిస్పందించే హక్కు ను తమ దేశం కలిగిఉందని ప్రకటించింది.

భారత్ దాడులను ‘నగ్న దురాక్రమణ’గా పేర్కొంటూ ఖండించింది. మహిళలు, పిల్ల లు సహ దాడులు చేసిందని ఆరోపించింది. పాకిస్థాన్  ప్రాదేశిక సమగ్రతను భారత్ ఉ ల్లంగించిందని ఆరోపించింది. అంతర్జాతీయ చట్టం ప్రకారం యుద్ధచర్యలుగా పేర్కొంది. ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్‌లోని ఎల్‌వోసీ వెంబడి ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ సైన్యం భారీ దాడులకు పాల్పడిందన్నారు.