17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఇందోజు రమేశ్ ఏకగ్రీవం

03-05-2025 12:26 AM

కల్లూరు, మే 2 విజయ క్రాంతి కల్లూరు మండల నూతన లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా ఇందోజు రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనారు. గురువారం రాత్రి పట్టణంలో ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన సమావేశం లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ చలువాది నగేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో కల్లూరు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అధ్యక్షునిగా ఇందోజు రమేష్, సెక్రటరీ కిన్నెర ఆనందరావు, ట్రెజరర్ దారా శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ రాయల మురళీధర్ రావు లను ఏకగ్రీవంగా ఎన్నికైనారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీనీ శాలువాలతో ఘనంగా సన్మానించారు. నూతన కమిటీ సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో గంగుల నారాయణరావు, రాయల నాగేశ్వరరావు, చారుగుండ్ల. అచ్యుతరావు, గులివెందుల. అప్పలనాయుడు, గుర్రం చిన్న శీను ,అనుమోలు. వెంకటేశ్వరరావు, దారా శ్రీనివాసరావు, పసుమర్తి రాంబాబు, అనుమోలు మురళి, అనుమోలు శ్రీనివాసరావు,మాజీ అధ్యక్షులు కొప్పరపు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.