17 July, 2026 | 8:44 PM

Breaking News

భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •   యథేచ్ఛగా చెట్ల నరికివేత.. పర్యావరణానికి ముప్పు   •   రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి   •   గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •  

అకాల వర్షానికి దెబ్బతిన్న పంటల పరిశీలన

06-05-2025 12:00 AM

కొండపాక, మే 05: కొండపాక మండలంలో ఆదివారం సాయంత్రం అకాల వర్షానికి నష్టపోయిన పంట పొలాలను మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారి శివరామకృష్ణ తో కలిసి సోమవారం పలు గ్రామాల్లో పరిశీలించారు. మండలంలోని మర్పడగ, సిరసనగండ్ల, ఖమ్మంపల్లి, దమ్మకపల్లి, కొండపాక తదితర గ్రామాల్లో వడగండ్ల వాన, ఈదురు గాలుల బీభత్సానికి పంటలన్నీ నష్టపోయాయి.

మామిడి కాయలు రాలిపోయి మామిడి తోటలకు తీవ్ర నష్టాన్ని గురిచేసింది. విషయం తెలుసుకున్న అధికారులు నాయకులు పలు గ్రామాల్లో పరిశీలించి రైతులను పరామర్శించారు. నష్టం వివరాలను సేకరించారు. పంటల నష్టాన్ని ప్రభుత్వానికి అందించి పరిహారం అందేలా కృషి చేస్తానని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాసరి లింగారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరశురాములు, నాయకులు మంచాల కనకరాములు నీల మల్లేశం కొయ్యడ వెంకటేశం యాదయ్య సిద్ధులు రామారావు తదితరులున్నారు.