30 June, 2026 | 10:37 AM

జొన్నల కొనుగోలు కేంద్రాల తనిఖీ

13-05-2025 12:05 AM

మునిపల్లి, మే12 : మండల కేంద్రమైన మునిపల్లితో పాటు పెద్దచెల్మెడ పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం తహశీల్దార్ గంగ భవాని  తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా  కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు ఆమె సూచించారు. అలాగే రైతులకు ఇ బ్బందులు లేకుండా కొనుగోళ్ళు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఆమె వెంట   పెద్దచెల్మెడ పిఎసిఎస్ సొసైటీ కార్యదర్శి శివకుమార్ రెడ్డి, ఆర్‌ఐ సుభాష్ తదితరులుఉన్నారు.