10 May, 2026 | 7:46 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

09-09-2025 07:11 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని న్యాయస్థానం ఆవరణలో మంగళవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. మేడ్చల్ కోర్టు బార్ అసోసియేషన్ మెంబర్ అయిన న్యాయవాది సురేష్ పై జరిగిన దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు. దాడికి గురైన న్యాయవాదికి సంఘీభావం తెలియజేశారు. న్యాయవాది రక్షణ చట్టం కోసం డిమాండ్ చేస్తూ న్యాయవాదులు నినదించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న, జనరల్ సెక్రటరీ ఎస్ ప్రదీప్ కుమార్, ఏజిపి సత్యం, సీనియర్ న్యాయవాదులు రాజేశ్వరరావు, కారుకూరి సురేందర్, అక్కల శ్రీధర్, గడిగొప్పుల కిరణ్ కుమార్, గాండ్ల సత్యనారాయణ, జి పద్మ, పాల్సన్, రెడ్డి మల్ల ప్రకాశం, మల్లికార్జున్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.