11-10-2025 08:55:50 PM
ప్రిన్సిపాల్ రవి..
మణుగూరు (విజయక్రాంతి): ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలో ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన ప్రవేశాల భర్తీ కోసం 5వ విడత వాకిన్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జి. రవి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడారు. ఈ నెల 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, ఈ నెల 13 నుండి 17 వరకు నేరుగా ఐటీఐకి వచ్చి ప్రవేశం పొందాలని సూచించారు. ప్రవేశం కొరకు https://iti.telangana.gov.in/లో ఆన్లైన్ చేసుకొవలన్నారు. ఈ అవకాశాన్ని యువతి యువకులు సద్వినియోగం చేసుకోని భవిష్య త్తుకు బంగారు బాటలు వేసుకోవాలని తెలిపారు.