9 May, 2026 | 10:18 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

కన్నాల ఎర్ర చెరువును పరిశీలించిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు

09-09-2025 06:07 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం(Bellampalle Mandal)లోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల ఎర్రకుంట చెరువును మంగళవారం నీటిపారుదల శాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లను కలుపుకొని 14 ఎకరాల భూమి ఎర్రకుంట చెరువు విస్తీర్ణంలో ఉందని నిర్ధారించారు. ఎఫ్ టి ఎల్ లెవెల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాతిన సిమెంటు ఫోల్లను త్వరలోనే తొలగిస్తామని, చెరువుకు పడిన తాత్కాలిక గండిని పూడ్చేలా పనులు ప్రారంభిస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని తహసిల్దార్ కృష్ణ కోరారు. వారి వెంట బెల్లంపల్లి టిడిపి పట్టణ అధ్యక్షులు మని రామ్ సింగ్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అంబాల మహేందర్, ఓ పి టి ఆర్ జిల్లా కన్వీనర్ గోగర్ల శంకర్ లు పాల్గొన్నారు.