17 April, 2026 | 2:34 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ఆ మంత్రి అసలు మనిషేనా?

15-10-2025 01:04 AM

బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతకు.. మంత్రులు తుమ్మల, పొన్నం క్షమాపణలు చెప్పాలి 

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ‘అసలు మనిషేనా..? మానవత్వం ఉందా..?’ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనతో మాగంటి సునీత కన్నీళ్లు పెట్టారని, కోల్పోయిన తన భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటే డ్రామా అంటారా? అని ఆయన మండిపడ్డారు.

మంగళవారం తెలంగాణ భవన్‌లో శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గం వాళ్లు ఓట్లు వేస్తే అదే సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయ్యారని, అదే సామాజిక వర్గం ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు. మాగంటి సునీత బిడ్డలు, కొడుకు ప్రచారం చేస్తే యాక్షన్ ఎట్లా అవుతుందని మాజీ మంత్రి నిలదీశారు.

మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ వెంటనే బీఆర్‌ఎస్ నాయకురాలు, జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రుల భాషను మహిళలు వినాలని,  ఆడబిడ్డను మంత్రు లు తుమ్మల, పొన్నం ప్రభాకర్ అవమానించారని ఆయన ఆరోపించారు.  రాజీవ్ గాంధీ చనిపోతే దేశవ్యాప్తంగా రాజీవ్ గాంధీ ఫొటోలతో ప్రచారం చేయలేదా..? అని ప్రశ్నించారు.