14 July, 2026 | 7:20 PM

Breaking News

ఇంటింటి సర్వైతో ఖచ్చితమైన ఓటరు జాబితా   •   ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •  

వరి కొయ్యలను కాల్చడం సరికాదు

10-12-2025 12:00 AM

జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి 

కొండపాక, డిసెంబర్ 9: కొండపాక మండలం వెలికట్ట గ్రామంలోని వరి కొయ్యలను కాల్చకూడదని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి పేర్కొన్నారు. కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో మంగ ళవారం మధుసూదన్ వరి పొలంలో వరి కొయ్యలను కాల్చడం వల్ల నష్టం తప్ప లా భం ఏమీ లేదని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారిని స్వరూపారాణి అన్నారు. ఈ సందర్భంగా స్వరూపారాణి మాట్లాడుతూ వరి కొయ్యలను కాల్చితే అధిక వేడి, నత్రజని, ఫాస్పరస్ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గుతుందన్నారు.

పంటలకు అవసరమైన ఖనిజలవణాలు దెబ్బతింటాయని, పొలాల్లో తిరిగే ఉడుములు, తొండలు అనేక జీవరాశులు చనిపోయే ప్రమాదం ఉందన్నారు. సమతుల్యత దెబ్బతింటుందని, వరి కొయ్యలను నేలలో కలియ దుంన్నడం వల్ల సేంద్రీయ కర్బన శాతం పెరిగి ఐదు నుంచి పది శాతం వరకు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. సూపర్ ఫాస్పేట్ లేదా వేస్ట్ డీకంపోజర్ చల్లితే వరి కొయ్యల అవశేషాలు రెండు వారాలలో మురికి పోషకాలుగా తయారైతాయన్నారు. సూపర్ ఫాస్ట్ చల్లడం వలన భూమి చౌడుబారక్కుండా సేంద్రీయ పదార్థాల స్థాయిని పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రమ్యశ్రీ, రైతులు తదితరులుపాల్గొన్నారు.