14-10-2025 12:46:00 AM
జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రం లో మంగళవారం నుంచి ఐదు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడి న తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30-40 వేగంతో గాలులు సైతం వీస్తాయని తెలిపింది. మంగళవారం 22 జిల్లాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది.