10-10-2025 10:23:35 PM
ఖానాపూర్: దస్తురాబాద్ మండలంలోని అకొండపేట గ్రామంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ ఆధ్వర్యంలో జన సురక్ష సాచురేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు, మహిళా స్వయం సంఘాలకు ఆర్థిక భాగస్వామ్యం, జన్ ధన్ ఖాతాలు, కేవైసీ ప్రాముఖ్యత, రుణాలు, సైబర్ నేరాలు, అప్రమత్తత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.