16 May, 2026 | 4:13 PM

Breaking News

నిర్మల్ అభివృద్ధి ద్రోహి ఎమ్మెల్యే   •   సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   గ్రామీణ ప్రజలకు మెడికవర్ ఆసుపత్రి ఉచిత వైద్య సేవలు   •   మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఏఐ టూల్స్   •   పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయి సభ్యులకు రివార్డులను అందజేత   •   తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు నకు కమిటీ ఏర్పాటు పట్ల హర్షం   •   లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం నూతన సెక్రటరీ గా పగడాల నరేష్   •   వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన డీఆర్‌డీఏ ఏపీడీ విజయ లక్ష్మీ   •   మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘స్త్రీనిధి’ కొండంత అండ   •  

జోతక్క ఇక లేరు

09-11-2024 12:13 PM

కరీంనగర్ (విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి జ్యోతిదేవి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె భర్త కొమొరెడ్డి రాములు సైతం మెట్‌పల్లి ఎమ్మెల్యేగా సేవలందించారు. గతేడాది ఆయన కన్నుమూశారు. జ్యోతక్క మృతితో కోరుట్ల నియోజకవర్గంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతి వార్త తెలియగానే జ్యోతక్క సమీప బంధువు అయిన హైకోర్టు న్యాయమూర్తి ఈవి వేణుగోపాల్, సోదరుడు ఈవి శ్రీనివాస్ లు బెంగుళూర్ కు బయలు దేరి వెళ్లారు.