19-08-2025 12:00:00 AM
ముషీరాబాద్, ఆగస్టు 18(విజయక్రాం తి): నిందితుడు కమలాకర్ శర్మ మొత్తం బినామీ, అక్రమ ఆస్తులు విక్రయించి పెట్టుబడిదారులకు చెల్లింపులు చేయాలని ధన్వంతరి బాధితుల ఫోరం కన్వీనర్ గిరి ప్రసాద్ శర్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితుడు కమలాకర్ శర్మ సీసీఎస్, అంబర్పేట్, కూకట్ పల్లి, పోలీసులపై కోర్టు డైరెక్షన్ను దుర్వినియోగం చేస్తూ విచారణకు ఆటంకం కలిగిస్తూ, కోర్టు డైరెక్షన్ పేరుతో పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బాధితులతో కలిసి ఆయన మాట్లాడారు. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి అధిక వడ్డీల పేరుతో 3 వేల మంది ప్రజల నుంచి రూ.1500 కోట్లు మోసపుచ్చిన కమలాకర్ శర్మ జైలుకు వెళ్లి బయటికి వచ్చారని తెలిపారు. పెట్టుబడిదారుల డబ్బులతో కొన్న ఆస్తులను అక్రమం గా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినవస్తున్నాయ న్నారు.
సీజ్లో ఉన్న భూములను ప్రైవేట్ సర్వే చేయడం, ఆర్థిక లావాదేవీలకు పాల్పడడం, ఒరిజినల్ డాక్యుమెంట్లను ఇస్తామని డబ్బులు వసూలు చేయడం, బెయిల్ కండిషన్లను దుర్వినియోగం చేస్తూ, కోర్టు ఉత్తర్వు లను ధిక్కరిస్తున్నారని తెలిపారు. బాధితుల్లో చాలామంది వయోవృద్ధులు ఉన్నారని, కొంత మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సెటిల్మెంట్ పేరిట జరుగుతున్న భూ వ్యాపారాలు, ఒప్పందాలను వెంటనే ఆపాలన్నారు.
కమలాకర్ శర్మ, లేడీ డైరెక్టర్స్ బె యిల్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీసీఎస్ విచారణ నత్తనడకన నడుస్తుందని, రాష్ట్ర ప్రభు త్వం చొరవ తీసుకొని సీసీఎస్కు అటానమస్ పవర్స్ ఇవ్వాలని కోరారు. అలాగే ఈ కేసుకు ప్రత్యేకంగా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించా లని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈనెల 26న నాంపల్లి ఎంఎస్జె కోర్టు తీర్పును బట్టి కమలాకర్ శర్మ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చ రించారు. ఈ సమావేశంలో బాధితులు ఎంవీ. శేషగిరి రావు, సాయికుమార్, సుబ్రహ్మణ్యం, ఛాయాదేవి, కృష్ణమూర్తి, డా. రామ్మోహన్ రావు, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.