30-10-2025 05:56:18 PM
మంథని (విజయక్రాంతి): మంథని ఎంపీడీఓగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 ద్వారా ఎంపికైన కంకనాల శ్రీజా రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా వచ్చిన ఎంపీడీఓకు ఈజీఎస్ కార్యాలయ సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తో పాటు ప్రజాప్రతినిధులు, జిల్లా మండల అధికారులు, ఉద్యోగులు, ప్రజల సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీడీఓ తెలిపారు.