calender_icon.png 4 November, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని హుజురాబాద్ కు తరలించాలి

03-11-2025 07:49:29 PM

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని హుజురాబాద్ కు తరలించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం  హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక బిజెపి శ్రేణులతో ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని బిజెపి ఆధ్వర్యంలో సందర్శించిన సమయంలో ఇక్కడి  ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వైద్యులు తెలియజేశారని,

ఆ సమస్యలను  బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్తే ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. నేడు ఆసుపత్రిలో నెలకొన్న  సమస్యల పరిష్కారం కోసం ఒక కోటి 50 లక్షలు  సి ఎస్ ఆర్  నిధులతో15 రకాల  అవసరమైన  వైద్య పరికరాలను ,  సామాగ్రిని  అందించారని తెలిపారు.  కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రస్తుతం మెడికల్ కళాశాలకు కేటాయించినందున, అక్కడి ఆసుపత్రిని హుజురాబాద్ కు తరలించడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.