28 June, 2026 | 12:06 PM

Breaking News

రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •   ఆర్‌ఎస్‌పీ భద్రత తగ్గింపు కక్ష సాధింపు చర్యే   •  

బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రం

03-11-2025 07:51 PM

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): బీసీ వర్గాల హక్కుల కోసం ప్రభుత్వం అమలు చేయాల్సిన 42% రిజర్వేషన్, ఉపాధి అవకాశాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ లోపాల పరిష్కారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ తంగళ్ళపల్లి మండలంలోని బీసీ సంఘాల ప్రతినిధులు తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించారు. బీసీలకు రాజ్యాంగపరమైన న్యాయం చేయాలంటే అన్ని విభాగాల్లో 42% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలులోకి రావాలని, గత ఏడు సంవత్సరాలుగా సెంట్రల్ ఇన్‌స్టిట్యూషన్లలో బీసీ రిజర్వేషన్ అమలు కానందున అనేక మంది విద్యార్థులు నష్టపోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే బీసీ వర్గాల శ్రేయస్సు కోసం 3.42% సబ్ కేటగరైజేషన్‌ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి బీసీ ఉక్కు సంఘం నివేదికలో పేర్కొన్న నిధులను ప్రభుత్వం విడుదల చేసి బీసీ అభివృద్ధి కార్యక్రమాలకు దోహదం చేయాలని వినతిపత్రంలో సూచించారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ సంఘం అధ్యక్షుడు కందుకూరి రామా గౌడ్, కోడి అంతయ్య, కోడెం రమేష్, సుద్దాల కర్ణాకర్, భాస్కర్, బాబు, దేవేంద్ర చారి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.