15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అయిత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కార్తీక మాసం వనభోజనాలు

19-11-2025 10:35 PM

కార్యక్రమంలో పాల్గున తాహసీల్దార్ శివప్రసాద్, ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి

చేగుంట (విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలో గల ప్రముఖ సంఘ సేవకులు  అయిత కుటుంబ  సభ్యుల సమేతంగా నిర్వహించిన కార్తీక మాస వనభోజనాలు కార్యక్రమంలో చేగుంట తాహసిల్దార్ శివప్రసాద్, స్థానిక ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో వనభోజనాలు అంటే కుటుంబం, స్నేహితులతో కలిసి వ్యవసాయ క్షేత్రాలు, తోటలు, దేవాలయాలు, ముఖ్యంగా ఉసిరి చెట్ల కింద భోజనం చేయడం ఈ ఆచారం. ఈ వనభోజనాలు ప్రకృతితో బంధాన్ని గుర్తు చేస్తూ, ఆనందాన్ని, ఉల్లాసాన్ని పంచుతుంది. కార్తీక మాసంలో ఎక్కవగా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చాలా పవిత్రమైనదిగాభావిస్తారని, ఉసిరి చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారని వారు ఉన్నారు.