10-05-2025 09:34:28 PM
భూత్పూర్: దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు భూత్పూర్ మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన మూస యాదయ్యకి ఎల్ఓసి నుండి రూ. 2 లక్షల చెక్కును లబ్ధిదారునికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో రావులపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైబు, మధు, కప్పెట వడ్డే శ్రీను తో పాటు తదితరులు ఉన్నారు.