17 April, 2026 | 10:19 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కీరవాణి సంగీతం భావోద్వేగభరితం

21-05-2025 12:46 AM

పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘హరిహరవీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మాత. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా జూన్ 12న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి బుధవారం థర్డ్ సింగిల్ ‘అసుర హననం’ను విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా  పవన్‌కల్యాణ్ మంగళవారం చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోను సందర్శిం చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. “మనలోని పౌరుషం, వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరినీ తట్టిలేపే-లా ‘సలసల మరిగే నీలోని రక్తమే...’ అంటూ పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు కీరవాణి.

‘హరిహర వీరమల్లు’లో ఈ గీతం వినిపిస్తుంది. నేటి పరిస్థితుల్లో మనందరిలో వీరత్వం చేవజారిపోకూడదని చర్నాకోలతో చెప్పినట్లనిపించింది. కీరవాణి సంగీతం కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళ్తాయి. ‘మొదటిసారి మీతో చేస్తున్నానంటే.. అంతా ఆసక్తిగా చూస్తారు. అందుకు తగ్గట్టు ఉండాలి కదా’ అనడం కీరవాణిలో అంకిత భావాన్ని తెలియజేస్తోంది. సృజనాత్మక స్వరాలతో మైమరపిస్తూ తెలుగు పాటను ఆస్కార్ వేదికపైకి తీసుకువెళ్లారు” అన్నారు.