31-10-2025 05:35:53 PM
 
							సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఇటీవల సెంటినరీ కాలనీలో జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి కేరళ మోడల్ హైస్కూల్లో పదవ తరగతి చదివే బొంగూరి అభిషేక్ విద్యార్థి ఎంపికయ్యారు, శుక్రవారం నుండి నాలుగో తేదీ వరకు మహబూబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ విద్యార్థి పాల్గొననున్నట్లు కరస్పాండెంట్ సిజు ఎస్ నాయర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని కరస్పాండెంట్ తో పాటు వైస్ ప్రిన్సిపాల్ స్మిత ఎస్ నాయర్ ఉపాధ్యాయులు కిరణ్ అభినందించారు.