15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మహాసభల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

10-11-2025 01:37 AM

రాజేంద్ర నగర్ నవంబర్ 9, ( విజయక్రాంతి ): ఈ నెల 10,11 వ తేదీల్లో కాటేదాన్లో  సిఐటియు రంగారెడ్డి జిల్లా 4వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు భవన నిర్మాణ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బచ్చలకూర స్వామి తెలిపారు. ఆదివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని  కాటేదాన్ బుద్వేల్ లేబర్ అడ్డావద్ద మహా సభల గోడ పత్రిక ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కుల కోసం ఉన్న 44 చట్టాలు రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మారుస్తున్న విధానాలను రద్దు చేయవలసిందిగా నాలుగు లేబర్  కోడ్ ల వల్ల కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందని  ఇది  ఇలా నే  కొనసాగితే కార్మికులకు ఉన్న హక్కులు పూర్తిగా హరించిపోతాయని... కార్మికులకు నష్టం కలిగించే ఈ విధానాన్ని వెంటనే  వెనక్కి తీసుకోవాలని కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.