calender_icon.png 6 September, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ల్యాబ్-గ్రోన్ డైమండ్ షోరూమ్

31-08-2025 12:18:03 AM

-పంజాగుట్టలో ప్రారంభం

-నటి పూనమ్ కౌర్, వీ-హబ్ సీఈవో సీతా పల్లచోల హాజరు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని పంజాగుట్ట లో ఎవర్‌లూమ్ ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ తన మొదటి షోరూమ్‌ను శనివారం ఘనం గా ప్రారంభించింది. నటి పూనమ్ కౌర్, వీ-హబ్ సీఈఓ సీతా పల్లచోల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎవర్‌లూమ్ బ్రాండ్ కొత్తగా తీసుకొచ్చిన ఆలోచనా విధానాన్ని అభినందించారు. ఈ ఎథికల్ ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ విలాసానికి ఒక మైలురాయిగా ఉంటుందని పేర్కొన్నారు. నివేదిత సోమ, ఇషితా తయా ల్, డాక్టర్ అముల్య రావు కలిసి ఈ షోరూమ్‌ను ఒక విజన్‌తో స్థాపించారని అన్నారు.

జెమ్, జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ దక్షిణ మండల ప్రాం తీయ చైర్మన్ మహేందర్ తయాల్ సహకారంతో, ఈ బ్రాండ్‌ను తొలి ఉమెన్-సెంట్రిక్ ల్యాబ్-గ్రోన్ డైమండ్ షోరూంగా మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా, ఎవర్‌లూమ్ స్థాపకు లు మాట్లాడుతూ, ఆభరణాల రూపాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుతూ నగరంలోనే మొట్ట మొదటి ఉమెన్-సెంట్రిక్ ల్యాబ్-గ్రోన్ డైమండ్ షోరూమ్‌గా ఎవర్‌లూమ్ నిలుస్తుందని తెలిపారు. 20కి పైగా వజ్రాల కట్‌లతో, సాంప్ర దాయ డిజైన్‌ల నుంచి సమకాలీన డిజైన్ల వరకు భారీగా కలెక్షన్లు ఉన్నాయని, ప్రతి ఆభరణం ఒక కథను చెప్పేలా రూపొందిం చబడ్డాయని వెల్లడించారు.