16 April, 2026 | 11:59 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

సమష్టిగా రోడ్డు ప్రమాదాలను నియంత్రిద్దాం

02-01-2026 12:00 AM
  1. ట్రాఫిక్ రూల్స్ వాహనదారుల, ప్రజలు పాటించాలి
  2. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం పోస్టర్ విడుదల చేసిన
  3. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు,జనవరి1(విజయక్రాంతి): ములుగు జిల్లాలో సమిష్టిగా అందరం కలిసి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.పిలుపుని చ్చారు. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ట్రాఫిక్ రూల్స్ పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.గు రువారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తన ఛాంబర్లో జాతీయ రోడ్డు మాసోత్సవం సందర్భంగా రవాణా శాఖ ఆద్వర్యంలో ప్ర చురించబడిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలకు సంబంధించిన ఫ్లెక్సీ,పోస్టర్లు, కరపత్రాలను అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ జనవరి ఒకటి నుంచి 31వరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం జరుగుతుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ అధికారులు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సామాజిక బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ అందరు పాటించేలా పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకురావాలని పేర్కొన్నారు. ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పాఠశాలల విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలని తద్వారా వారి తల్లిదండ్రులకు వివరించేలా చూడాలని చెప్పారు. ఇందుకు ప్రైవేట్ స్కూ ల్స్ యజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.