20-11-2025 09:37:08 PM
మంత్రికి బీసీ సంఘాల వినతి
కామారెడ్డి (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగ రక్షణ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థలు నిర్వహించాలని 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ప్రతినిధులు కోరారు. గురువారం కామారెడ్డికి వచ్చిన ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. 42 శాతం రిజర్వేషన్ కల్పించిన అనంతరమే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ నేతలు పాప శివరాములు, నీల నాగరాజు,లక్ష్మణ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.