17 April, 2026 | 1:50 PM

Breaking News

హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •   పెద్దకొత్తపల్లి గ్రామ హహిళ సర్పంచ్‌కు ఘోర అవమానం.!   •   నోటీసులు వెనక్కి తీసుకోవాలి.. సీపీఐ నాయకుల డిమాండ్   •  

బాన్సువాడ నుండి శబరిమలకు మహా పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాములు..

03-11-2025 07:33 PM

మహా పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించిన పోచారం, కాసుల..

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ అయ్యప్ప ఆలయం నుండి సోమవారం శబరిమలకు బయలుదేరిన మహా పాదయాత్రను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ లతో కలిసి జండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోచారం మాట్లాడుతూ అయ్యప్ప స్వాముల పాదయాత్ర ఆధ్యాత్మికతకు ప్రతీక అని ఆయన అన్నారు.

గత 16 సంవత్సరాలుగా గురు వినయ్ గురుస్వామి ఆధ్వర్యంలో సువర్ణభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో బాన్సువాడ అయ్యప్ప ఆలయం నుండి భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు శబరిమలైకి పాదయాత్రగా వెళ్లడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ సంవత్సరం 80 మంది అయ్యప్ప స్వాములు పాదయాత్రగా వెళ్లడం అయ్యప్ప కృపాకటాక్షాలేనని ఆయన కటాక్షం లేనిది పాదయాత్ర వెళ్లడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

భక్తిశ్రద్ధలతో తెల్లవారుజామున చలికాలంలో చల్లటి నీళ్లతో తానం చేసి గజగజ వనికే సమయంలో అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామికి పూజలు చేయడం అలాగే భక్తి పారవశ్యంలో ప్రత్యేక పూజలు చేయడం ఎంతో గొప్ప విషయమని అయ్యప్ప ఆశీర్వాదం అయ్యప్ప స్వాములపై భక్తులపై ఉండాలని అన్నారు.బాన్సువాడ నుంచి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాముల బృందాన్ని అభినందించారు. అయ్యప్ప స్వాముల పాదయాత్ర ఆధ్యాత్మికతకు ప్రతీకగా, భక్తుల్లో ఆత్మశుద్ధి, నియమ నిష్ఠలకు దారి చూపుతుందన్నారు.స్వాముల భద్రత, ఆనందంతో శబరిమల యాత్రను పూర్తి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు అర్షపల్లి సాయి రెడ్డి,మున్సిపల్ మాజీ ఛైర్మన్ జంగం గంగాధర్, గురు వినయ్, నార్ల సురేష్, ఎజాజ్, గురుస్వాములు, అయ్యప్ప భక్తులు  స్వాములు పెద్దఎత్తున పాల్గొన్నారు.