11-08-2025 08:56:31 PM
చిట్యాల (విజయక్రాంతి): మండలంలోని కోసూరుపల్లి గ్రామానికి చెందిన ఎండి.సాజిద్ వారం రోజుల క్రితం సెల్ ఫోన్ పోగొట్టుకోగా బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీఈఐఆర్ యాప్ ను ఉపయోగించి సెల్ ఫోను గుర్తుంచి స్వాధీనం చేసుకున్నారు. అట్టి సెల్ ఫోన్ ను ఎస్ఐ జి.శ్రావణ్ కుమార్(SI G. Shravan Kumar) సోమవారం బాధితుడికి అందజేశాడు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, సెల్ ఫోన్ లు చోరీకి గురైన, పోగొట్టుకున్న స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తీరిగి అప్పగించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.