31-01-2026 12:15:18 AM
శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో స్వచ్ఛభారత్
సుల్తానాబాద్, జనవరి 30 (విజయ క్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ వద్ద శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకల ను ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భం గా మాహత్మ గాంధీ విగ్రహానికి పూలమాల లు వేసి,ఘనంగా నివాళులర్పించడం జరిగిం ది , స్వాతంత్రం తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ సేవలను ఆర్యవైశ్య సంఘం నాయకులు కొనియాడారు, అనంతరం శ్రీ వేణు గోపాలస్వామి దేవాలయం ఆవరణ లో స్వ చ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.... చెత్తాచెదారాన్ని తొలగించి పరిస రాలు శుభ్రపరచడం జరిగింది.
పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవి వనిత క్లబ్, వాసవి క్ల బ్ ల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం లో పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.... అం తకు ముందు వాసవి మాత దేవాలయం లో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది, పూజారి వల్ల కొండ మహేష్ తీర్థ ప్రసాదాలు అందజేశారు.