12-08-2025 06:22:22 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసేలా చూడాలని కొత్తపల్లి బిజెపి మండల అధ్యక్షుడు కుంట తిరుపతి(BJP Mandal President Kunta Tirupati) పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ సూచన మేరకు కొత్తపల్లి రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ ఖాజీపూర్ చౌరస్తా నుండి బావుపేట గ్రామంలోని అంగడిబజార్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా కుంట తిరుపతి మాట్లాడుతూ... ప్రజలతో కలిసి తిరంగా యాత్ర కార్యక్రమాలు నిర్వహించి, దేశ సమైక్యత సమగ్రత కోసం ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ దేశానికి గర్వకారణంగా నిలిచిందన్నారు. యావత్ ప్రపంచమే భారత్ ధైర్య సాహసాలు, శక్తి సామర్ధ్యాలను చూసి నివ్వరపోయిందన్నారు.
సింధూర్ తో దేశ ఖ్యాతి విశ్వంలో మార్మోగిపోయిందని, అందులో భాగంగా నిర్వహించే కార్యక్రమలలో మన త్రివిధ దళాలను ప్రశంసిస్తూ, వీరుల త్యాగాలను గుర్తించాలని ఆగష్టు 13 నుండి 15వ తేదీ వరకు పార్టీ కార్యకర్తలు అందరి ఇంటిపై, కార్యాలయాల భవనాలపై త్రివర్ణ పతాకం ఎగరవేయాలని, సాధ్యమైనంతవరకు పిల్లల చేత జెండాలు ఎగర వేయించాలన్నారు. స్వాతంత్ర పోరాటకు స్మారక చిహ్నాలు, స్వాతంత్ర ఉద్యమంలో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు, యుద్ధ స్మారక చిహ్నల చుట్టూ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని, అన్ని ప్రాంతాలలో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టి, మహనీయులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కడార్ల రతన్ కుమార్, రమేష్ , కుమార్, కోమటిరెడ్డి అంజన్ కుమార్, వేముల అనిల్ కుమార్ ,సోమినేని కర్ణాకర్, గుడిసెల రంజిత్, కుమార్ ,పోర్తి అనిల్ ,బోనాల నరేష్ ,కడారి శ్రీనివాస్ ,ఇల్లందు ఆనంద్, బైరెడ్డి వంశీ, మెరుగు మల్లేశం మరియు బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.