27 June, 2026 | 7:06 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

నాచారంలో వ్యక్తి దారుణ హత్య

03-11-2025 07:19 PM

ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం పారిశ్రామిక వాడలో ఓ వ్యక్తి  హత్య గురైన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నాచారం సబ్ ఇన్స్పెక్టర్ మైబెల్లి తెలిపిన వివరాల  ప్రకారం నాచారం పారిశ్రామిక వాడలో  తెలంగాణ ఫుడ్ పరిశ్రమ సమీపంలోని గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని కత్తులతో దాడి  చేసి పారిపోయారు. రక్తపు మడుపులో తీవ్ర గాయాలైన వ్యక్తిని చూసిన స్థానికులు నాచారం పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని  హత్యకు గురైన వ్యక్తి మురళీకృష్ణ  గుర్తించారు. మురళి కృష్ణ వృత్తి రీత్యా  సెంట్రింగ్ వర్కర్ అని  అతని భార్య ఉప్పల్ కళ్యాణపుర్లోని ఒక ఇంట్లో కేర్ టేకర్ గా  పనిచేస్తూ జీవన సాగిస్తుంది అని తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియల్సి ఉంది అని  పోలీసులు తెలిపారు మృతిదేహంని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు నాచారం సబ్ ఇన్స్పెక్టర్  మైబెల్లి తెలిపారు.