17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం

03-11-2025 03:15 AM

ఎల్లారెడ్డిపేట,నవంబర్2 (విజయక్రాంతి): ఎల్లారెడ్డిపేట శివారులోని కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై గల హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దు మాల గ్రామానికి చెందిన జాలపల్లి అంజయ్య(37) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

దుమాల గ్రామానికి చెందిన అంజయ్య ఎల్లారెడ్డిపేట సమీపంలోని హెచ్ పిపెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకోవడానికి వెళుతుండగా..కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన ర హదారిపై నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ద్విచక్రవాహాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

అతడికి 8 నెలల క్రితమే సుస్మిత తో వివాహం జరిగిం ది.సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ రాహుల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా రు.పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.భర్త మృతి చెందాడని విషయం తెలిసి మృతుడి భార్య,కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో దూమల గ్రామంలో తీవ్ర విషాద చాయలు నెలకొన్నాయి.