15 April, 2026 | 12:10 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వైద్య విద్యార్థికి మన్నె జీవన్ రెడ్డి ఆర్థిక చేయుత

28-10-2025 10:43 PM

రూ. లక్ష 35వేల ఆర్థిక సాయం..

మహబూబ్ నగర్ టౌన్: నిరుపేద వైద్య విద్యార్థికి ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ నాయకులు మన్నె జీవన్ రెడ్డి ఆర్థికంగా అండగా నిలిచారు. మహబూబ్నగర్ రూరల్ మండలం మాచన్ పల్లి తండాకు చెందిన కడావత్ రాజేశ్వరి ఎంతో కష్టపడి చదివి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ లో సీటు సాధించింది. ఆమె కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న దృష్ట్యా కాంగ్రెస్ నాయకులు మన జీవన్ రెడ్డి ఆర్థికంగా చేయూత అందించారు.

కళాశాల ఫీజు రూ. లక్ష 35వేలు ను ఆన్ లైన్ లో విద్యార్థికి పంపించారు. ఈ సందర్భంగా మన్నే జీవన్ రెడ్డికి రాజేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మన్నే జీవన్ రెడ్డి ఎంతోమందికి వైద్య చికిత్సల కోసం, విద్యార్థుల ఫీజుల కోసం ఆర్థిక సాయం అందజేశారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి వచ్చిన వెంటనే ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు మన్నే జీవన్ రెడ్డి.