21-11-2025 12:59:14 AM
హుజురాబాద్,నవంబర్ 20:(విజయక్రాంతి) మావోయిస్టునేత హిడ్మాను పట్టుకొని చిత్రహింసలు చేసి బూటకపు ఎన్కౌంటర్ చేశారని టి పి సి సి,ఎస్ సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో గురువా రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
దేశంలో గత ఆరు నెలల నుండి ఆపరేషన్ కాగార్ పేరుతో బిజెపి ప్రభుత్వం మోడీ, అమిత్ షా అరాచక పాలన చేస్తూ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విస్మరించి మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా పెట్టుకొని పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. హిడ్మది బూ టకపు ఎన్కౌంటర్ గా కోర్టు సుమోటాగా తీసుకొని ఆయా పోలీస్ అధికారులపై కేసు నమోదు చేయాలని ఆయనడిమాండ్చేశారు.