28 June, 2026 | 3:06 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

చెర్వుగట్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

03-11-2025 07:57 PM

నకిరేకల్ (విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు శ్రీ పార్వతి జ‌డ‌ల రామ‌లింగేశ్వ‌ర స్వామి ఆల‌య అభివృద్ధి కొరకై సోమవారం హైదరాబాదులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో అధికారులతో, ప్రజాప్రతినిధులతో, మాస్ట‌ర్ ప్లాన్ పై రివ్యూ స‌మావేశం నిర్వహించారు. పలు అభివృద్ధి పనులపై ఆమె సమీక్షించారు. దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రట‌రీ శైల‌జా రామ‌య్య‌ర్, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.