2 May, 2026 | 1:10 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే మెటీరియల్ సప్లై చేయాలి

01-07-2025 09:03 PM

వలిగొండ (విజయక్రాంతి): ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం అవసరమయ్యే ఇనుము, సిమెంటు మార్కెట్ ధర కాకుండా తక్కువ ధరకు సప్లై చేయాలని మండల ప్రత్యేకాధికారి జగన్నాథ రావ్(Mandal Special Officer Jagannath Rao) దుకాణదారులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మెటీరియల్ సప్లై దుకాణదారులతో నిర్మాణ మేస్త్రీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్ళు మాత్రమే కట్టుకుంటున్నారని కావున ఇండ్లకు తక్కువ ధరకు సప్లై చేయాలని, మేస్త్రీలకు తక్కువ ధరకే నిర్మాణం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ దశరథ, ఎంపీడీవో జితేందర్ రెడ్డి, ఎస్ఐ రవీందర్ గౌడ్, ఎంపీఓ కేదారేశ్వర్, పంచాయతీరాజ్ ఏఈ సందీప్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, మేస్త్రి సంఘం ప్రతినిధులు, ట్రేడర్ల యజమానులు పాల్గొన్నారు.