22-12-2025 09:39:28 PM
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో ఘనంగా గణిత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గణిత శాస్త్ర ఉపాధ్యాయులు రాజేశ్వర్,సురేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులు గణిత శాస్త్ర ఆకృతలను ప్రదర్శించడం, క్విజ్ నిర్వహించి, గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానము చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, రాధ, చల్లా లక్ష్మణ్, భవాని, వెంకటేష్, మనోహర్ రావు, శారదా, ఉమా దేవి, ఉమా మహేశ్వరీ, హిమవర్ష, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.