15 April, 2026 | 12:35 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నేడు మేడారం దర్శనం బంద్

24-12-2025 01:01 AM
  1. పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల ప్రతిష్ఠాపన 
  2. పూనుగొండ్ల నుంచి బయలుదేరిన పెనుక వంశస్థులు 

మహబూబాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ కుంభమేళగా గుర్తిం పు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంలో భాగంగా బుధవారం పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలపై పున:ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధ వారం భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నట్టు పూజారులు వెల్లడించారు.

కాగా పగిడిద్దరాజు స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూను గొండ్ల నుంచి పెను క వంశీయులు మేడారంలో పగిడిద్దరాజు గద్దెపై ప్రతిష్టించే ధ్వజస్తంభానికి మంగళవారం పూజలు నిర్వహించారు. గిరిజన సంప్రదాయం ప్రకారం పెనుక వంశస్థులు పూను గొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మేడారం బయలుదేరి వెళ్లారు. మేడారంలో కొత్తగా నిర్మించిన గద్దెల ప్రాంగణం పై బుధవారం ధ్వజస్తంభాన్ని ప్రతిష్టిస్తారు.