22-08-2025 12:35:35 AM
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
మద్నూర్ ఆగష్టు 21 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం రాచూర్ గ్రామంలో ప్రజలు అనారోగ్యంతో బాధపడుతుండగా విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం తక్షణమే స్పందించి రాచూర్ గ్రామానికి వెళ్లారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయించారు. ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించి ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని, వెంటనే వైద్య అధికారులకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు.
వైద్యుల బృందాన్ని గ్రామానికి పిలిపించి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. వైద్యుల బృందం... అనారోగ్యానికి గురైన వారికి పరీక్షలు చేసి, వైద్యం అందించి, మందులు అందజేశారు. వైద్యుల సూచన మేరకు కొంతమంది పేషంట్స్ ను మద్నూర్ మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ కు పంపించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు ఉన్నారు.
వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో
మద్నూర్ ఆగష్టు 21(విజయ క్రాంతి) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని గురువారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠాపన,శిఖర స్థాపన మహోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. బీ.సీ కాలనీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ కమ్యూనిటీకి పెద్ద పీఠ వేస్తుందని తెలిపారు.
జుక్కల్ నియోజకవర్గంలో కూడా ముదిరాజ్ కమ్యూనిటీ అభివృద్ధికి తాను కృషి చేస్తానని తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించడమే గాక అన్ని విధాలుగా అండగా ఉంటానని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. ముదిరాజ్ లకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తానని భరోసా ఇచ్చారు. ముదిరాజ్ సంఘం భవనం కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే రూ. 20 లక్షలు మంజూరు చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు అశోక్ ఉపాధ్యక్షులు చిన్న ముదిరాజ్ సంఘం కుల పెద్దలు మండల కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ తదితరులు పాల్గొన్నారు.