14 June, 2026 | 4:15 PM

Breaking News

ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •   రక్తదానం చేసిన సాయి కిషోర్ గౌడ్   •  

26న బెల్లంపల్లిలో మెగా జాబ్ మేళా

23-10-2025 08:32 PM

బెల్లంపల్లి అర్బన్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్ లో ఈ నెల 26వ తేదీన సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మందమర్రి జిఎం ఎన్ రాధాకృష్ణ తెలిపారు. గురు వారం బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్ లో మెగా జాబ్ మేళా పోస్టర్ లను సింగరేణి అధికారులు, సిబ్బందితో కలిసి ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతీ, యువకుల ఉపాధి కోసం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని, సుమారు 60 నుంచి 70 వివిధ రకాల కార్పొరేట్ కంపెనీలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు.

నిరుద్యోగ యువతీ యువకులు వారి అర్హతలను బట్టి ఉద్యోగాలను పొందాలని ఆకాంక్షించారు. పెద్ద మొత్తంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, ఈ మేళాను బెల్లంపల్లి, మందమర్రి పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టూ జీఎం విజయ ప్రసాద్, బెల్లంపల్లి బ్రాంచి ఏఐటీయూసీ కార్యదర్శి దాగం మల్లేష్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, సీఎంఓ ఏఐ ప్రెసిడెంట్ రమేష్, సివిల్ ఎస్ ఈ రాము, ఎంవీటిసి శంకర్, ఏఐటియూసి మందమర్రి బ్రాంచి సెక్రటరీ సత్యనారాయణ, సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య, అధికారులు పాల్గొన్నారు.