13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఆరుట్ల దంపతుల స్మారక క్రీడోత్సవాలు ప్రారంభం

08-01-2026 12:00 AM

ఆలేరు, జనవరి 7 (విజయక్రాంతి): ఆలేరు నియోజకవర్గంలోని ఆత్మకూరు బాల బాలికల ఉన్నత పాఠశాలలో తెలంగాణ సాయుధ పోరాట నాయకులు డా. ఆరుట్ల కమలాదేవి - రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ స్థాయి ఆరుట్ల దంపతుల స్మారక క్రీడోత్సవాలు 2025-2026లను కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సిహులు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్రీడోత్సవాలను క్రీడాకారులు విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  సభాధ్యక్షులు కొత్త మహదేవ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, కందుల సత్యనారాయణ జిల్లా విద్యాశాఖాధికారి, యాదాద్రి భువనగిరి, పల్లా వెంకట్రెడ్డి, మాజీ శాసనసభ్యులు మునుగోడు సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, యానాల దామోదర్ రెడ్డి, సి.పి.ఐ. పార్టీ సినీయర్ నాయకులు, ఆత్మకూరు సర్పంచ్ బీసు ధనలక్ష్మీ, ప్రజా ప్రతినిధులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.