11-07-2025 06:39:51 PM
నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ రక్షణ శాఖ మంత్రి కొండా సురేఖ నిర్మల్ జిల్లాలో పర్యటించినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరిన మంత్రి పదకొండు గంటలకు బాసర చేరుకుంటారన్నారు. బాసరలో త్రిబుల్ ఐటీ సందర్శించిన అనంతరం అమ్మవారిని దర్శించుకుని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారని కలెక్టర్ వివరించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఆమె పరిశీలించి అధికారులకు సూచనలు సలహాలు అందించారు. సాయంత్రం ఐదు గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్తారని ఆమె తెలిపారు