calender_icon.png 8 July, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి

03-07-2025 12:00:00 AM

ఖమ్మం, జులై 2(విజయ క్రాంతి): ఖమ్మం రూరల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నూతన కార్యాలయం, ఆధునీకరించిన ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బాధితులు నిర్భయంగా పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసే అనువైన పరిస్థితులు కల్పించేలా పోలీస్ స్టేషన్ లో ఉండాలని అన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అడిషనల్ డిసిపి ప్రసాద్ రావు, ఏసీపిలు తిరుపతిరెడ్డి, రమణమూర్తిపాల్గొన్నారు.