మానుకోటకు నేడు మంత్రి పొంగులేటి రాక
27-12-2025 01:03 AM
మహబూబాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నూకల రామచంద్ర రెడ్డి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరిస్తారని, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.






