15 April, 2026 | 1:49 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు

15-11-2025 09:48 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి శిల్పి తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ముందుగా కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకుని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కోసం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య మాట్లాడుతూ, “ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధికి పునాది వేసిన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. తనదైన అనుభవం, శైలి, క్రమశిక్షణతో ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన నాయకత్వంలో జిల్లాలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతాయని నమ్ముతున్నాం” అని పేర్కొన్నారు.