23-08-2025 05:07:57 PM
కరీంనగర్,(విజయక్రాంతి): రాష్ట్ర కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి శనివారం మానకొండూర్ ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను పరామర్శించారు. ఆయన సోదరుడు కవ్వంపల్లి రాజేశం ఇటీవల కన్ను మూయగా వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. మంత్రి వెంట బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మేర రవీందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.