6 May, 2026 | 3:22 PM

వ్యక్తి అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు

20-09-2025 06:47 PM

నవాబ్ పేట్: మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్సై విక్రం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవాబ్ పేట మండలం లోని రుద్రారం గ్రామానికి చెందిన దుల్ల చిన్నయ్య అనే వృధుడు ఈనెల 16వ తేదీన   సాయంత్రం నుంచి కనిపించడం లేదు. అతని కుమారుడు దుల్ల రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బందువుల వద్ద గ్రామలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బాధితుడు దుల్ల రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలియచేశారు.