16-08-2025 10:58:21 PM
ఖానాపూర్: కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో కడెం ప్రాజెక్టు వద్ద జిల్లా అధికారులు ప్రాజెక్టు పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు వద్దనే ఉండి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.